అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించిన భక్తజనం.

ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు.

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 6
కొత్తగూడెం డివిజన్ ఆర్సి
*రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రేడ్డి సతి సమేతంగా భధ్రాచల సీతరామ చంద్రస్వామిని 11:35 నిమిషాలకు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదులతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
రామ నామ స్మరణలతో మారుమోగిన భద్రాద్రి..
జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక ఆదివారం భద్రాచలం లో కనుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు.
లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కళ్యాణ మూర్తులకు అలంకరణ చేసి మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల‌్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయజయద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు. యోక్త్రధారణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలుగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి, కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహా
పలు అభరణాలను స్వామి, అమ్మవారికి అలంకరించారు.
కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జిలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. జగత్ కల్యాణ శుభ సన్నివేశాన్ని కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య
ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు.రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవశ్యంలో ఓలలాడింది. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి సోమవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.మిథిలా స్టేడియానికి చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు, స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, దేవాదాయశాఖ. మంత్రి శ్రీమతి కొండా సురేఖ,
రాష్ట్ర రెవెన్యూ గృహ, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ, జౌళి సహకార శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరహరి,
నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, భద్రాచలం, పినపాక, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, కొత్తగూడెం శాసనసభ్యులు.పాల్గొన్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్.ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలు మేళతాళాలతో స్వాగతం పలికారు.స్వామి వారి కళ్యాణ వేడుకలకు తెలంగాణ
హై కోర్ట్ జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద, ఎపి హై కోర్టు జడ్జి కృష్ణ మోహన్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల జడ్జీలు రాజ గోపాల్, వసంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉదయం 5 గంటలకు సెక్టార్ కు చేరుకుని సెక్టార్ లో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వేడిమి దృష్ట్యా భక్తులు ఇబ్బందులు. పడకుండా మిథిలా స్టేడియం చల్లదనంగా ఉండేవిధంగా మిస్ట్ ఫాగ్
ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహిత్ రాజు నేతృతంలో పోలీస్ యంత్రాంగం పట్టిస్ట బందో బస్తు ఏర్పాట్లు చేసింది.

Join WhatsApp

Join Now