ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 11
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
గత పది సంవత్సరాలలో చేయని అభివృద్ధి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక పోయిన అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ తగినీయకుండా అభివృద్ధితోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ కార్యక్రమాలను ప్రతి పేదవాడికి అందే విధంగా ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ఇందిరమ్మ హయాంలో చేసి చూపెడుతున్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం నాడు మణుగూరు లోని పినపాక శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి
ఇందిరమ్మ ప్రభుత్వ సహాయం లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని, పేదవాళ్లే కావచ్చు ధనికులు కావచ్చు పది లక్షల రూపాయల వరకు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య కార్డు ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నామని,500 రూపాయలకే ఉచిత గ్యాస్ పథకం, వాటితోపాటు రాజీవ్ యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నిరుద్యోగ యువకులకు 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు అందించే కార్యక్రమాన్ని ఈనెల 14 తేదీ అంబేద్కర్ జయంతి రోజు నాడు ప్రారంభిస్తున్నామని, ప్రతి పేద కుటుంబాలు తృప్తిగా సన్న బియ్యం తోటే భోజనాలు చేయాలని ఉగాది పండుగ రోజున ఈ బహుత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని, మా ప్రభుత్వము వస్తే రైతులను రాజుని చేస్తామని వాగ్దానం చేశామని, అన్నమాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేశామని 25 లక్షల 65 వేల మందికి 687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసి సన్న వడ్లు పండించే రైతన్నలకు ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. త్వరలో పినపాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎప్పటినుండో పరిష్కరించకుండా ఉన్న పులుసు బొంత ప్రాజెక్టును రాబోయే కొద్ది నెలల లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేతుల మీదుగాశంకుస్థాపనచేసుకోబోతున్నామని మంత్రి తెలిపారు. ఈనెల 14 నాడు అంబేద్కర్ జయంతి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పారామంలో సాయంత్రం ఐదు గంటలకి భూభారత చట్టాన్ని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025 ని అన్ని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకి ఆహ్వానించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములకు ద్వారా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్నిన ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.