ఘనంగా సర్దార్ జలగం వెంగళరావు 103 జయంతి వేడుకలు

ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల ప్రతినిధి మే 4

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీ”శే”సర్దార్ జలగం వెంగళరావు గారి 103 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జలగం వెంగళరావు, చేసిన కృషి ఎంతో గొప్పదని, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం అని అన్నారు. జిల్లాకు సింగరేణి,నవభారత్,స్పాంజ్ ఐరన్,ఐటిసి,హెవీ వాటర్ ప్లాంట్ వంటి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని,ఎన్నో ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి ఊపిరిపోశారని, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆ మహానుభావుని చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించి భవిష్యత్ తరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు

Join WhatsApp

Join Now