మంత్రి సీతక్క ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
ప్రశ్న ఆయుధం 17 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి )
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన ఇన్ఛార్జి మంత్రిగా నియమింపబడ్డ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క )గారిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంచాయతీ రాజ్ రోడ్లకు అదనపు నిధులు కేటాయించాలని,జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్క ను కోరడం జరిగిందని ఆయన తెలిపారు.