ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించ వద్దు
ప్రశ్న ఆయుధం 17 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థి,విద్యార్థినీలను చేర్పించి పిల్లలు భవిష్యత్ తో ఆడుకోవద్దని పిల్లలు ఇబ్బందులకు పాలవుతారని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోంపుర్ పోచిరాం తల్లిదండ్రులను కోరారు.ఈ సందర్బంగా పోచీరాం మాట్లాడుతూ… అనుమతి ఉన్న ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకుని ప్రైవేట్ బడిలో పిల్లలను పంపిస్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూల్ యజమాన్యాలు, గవర్నమెంట్ సూచించిన నివేదిక ప్రకారమే స్కూల్ ఫీజులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.