ఈపి ఆపరేటర్ల పదోన్నత లేఖలు సకాలంలో ఇవ్వాలి

సింగరేణి యాజమాన్యాని కోరిన ఈపి ఆపరేటర్లు
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి వ్యాప్తంగా ఈపి ఆపరేటర్ల పదోన్నతులు లేఖలు సకాలంలో ఇవ్వాలని ఈ పి ఆపరేటర్లు సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు మణుగూరు ఏరియా ఈ పీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నుండి వారు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా నాయకులు సయ్యద్ నాసర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ స్థాయి మణుగూరు కొత్తగూడెం సత్తుపల్లి ఇల్లెందుకు చెందిన వివిధ ఓపెన్ కాస్ట్ గనులలో పనిచేస్తున్న ఈపి ఆపరేటర్ల పదోన్నతులకు సంబంధించి మార్చి నెలలో స్పెషల్ గ్రేడ్,ఏ గ్రేడ్,బి గ్రేడ్ ఖాళీల భర్తీకి అర్హులైన ఆపరేటర్లకు మణుగూరులో ఇంటర్వ్యూలు నిర్వహించి గ్రేడ్ టెస్ట్ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడించారని గత మూడు నెలలుగా ప్రమోషన్లు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఆపరేటర్లందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని కానీ తీవ్ర జాప్యం జరగడంతో వారు తీవ్ర అసహనానికి గురయ్యారన్నారు. ప్రమోషన్ల ప్రమోషన్ల ఆర్డర్ కాపీలు అందజేయడంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ అధికారులు తీవ్ర జాక్యం చేయటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయమై ఇప్పటికే సింగరేణి సీఎండి ఎన్ బలరాంని డైరెక్టర్ పా కొప్పుల వెంకటేశ్వర్లు ని కూడా కలిసి వినతి పాత్రలు కూడా అందజేశామని ఇతర అధికారులు కూడా కలిశామని అయినా సకాలంలో పదోన్నతులు ప్రమోషన్స్ ఆర్డర్స్ అందజేస్తే సంబంధిత ఆపరేటర్లందరూ ఎంతగానో సంతోషిస్తారని యాజమాన్యం ఆ దిశగా ఆలోచన చేసి వీలైనంత త్వరగా ప్రమోషన్ లేఖలు అందజేయాలని ఆయన కోరారు.అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ఆపరేటర్లకు సంబంధించి డీ టు సి ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు.ఉత్పత్తి ఉత్పాదకతలలో ప్రధాన పాత్ర పోషించే ఆపరేటర్ల ను ప్రోత్సహించే విధంగా యాజమాన్యం చర్యలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment