*రైతులఅందరికీ రైతు భరోసా వెంటనే చెల్లించాలి*
*కౌలు రైతులకు భూమి లేని వారికి ఇచ్చిన హామీ ప్రకారం యాసంగి వర్షాకాలం తో కలిపి 12 వేల రూపాయలు చెల్లించాలి*.
*తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాములు*
*జమ్మికుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా కౌలు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పంటకు చెల్లించాల్సిన 6000 రూపాయలు వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రోజున జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులతో పాటు , కౌలు రైతులకు, భూమి లేని కూలీలకు, తక్షణం రైతు భరోసా కింద యాసంగి వర్షాకాలం సీజన్ కు కలిపి 12000 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలని రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని 2024 వానకాలం సీజన్ లో ఇవ్వలేదు ఎకరంకు రూ. 7,500 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6000లకు తగ్గించిదని 2025 యాసంగి సీజన్ లో 53.4 లక్షల మందికి రూ.4.366ల కోట్లు 72 లక్షల ఎకరాలకు మాత్రమే చెల్లించారు. ఆ తర్వాత చెల్లింపులు చేయలేదని అందులో కౌలు రైతులకు వ్యవసాయ కూలీల ఊసే లేదని 2025-26 సంవత్సర వానకాలానికి 70 లక్షల మంది రైతులకు రూ.7,320 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాలని లేనియెడల రైతు సంఘాలు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలను, కలుపుకొని ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు