పేదలకు గుడ్ న్యూస్.. దసరాకు ఇళ్లు షురూ!
Jun 17, 2025,
పేదలకు గుడ్ న్యూస్.. దసరాకు ఇళ్లు షురూ!
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో పేదలకు శుభవార్త. టిడ్కో ఇళ్లను దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇళ్లకు ఎంత ఖర్చైనా సరే మహిళలకు టిడ్కో ఇళ్లు అందించాలని ఇటీవల సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని.. గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. రూ.7000 కోట్లతో టిడ్కో ఇళ్లు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.