ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం

*ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం*

*3000 రూపాయలు చెల్లిస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా 200 ట్రిప్పులు*

*ఆగష్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త నిబంధన అమలు*

*కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన*

న్యూ ఢిల్లీ :

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ కోసం రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేల పై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment