ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకత.
దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
తీర్పునకు వ్యతిరేకంగా బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారుపోలీసులు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్కు కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్టు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బంద్కు సహకరించాలని వారు కోరారు..