*ఒంటరి మహిళను హతమార్చిన దుండగులు*
*ఆమె మెడ లో బంగారు చైను, గొలుసు మరి ఇతర నగలు అపహరణ*
తిరుపతి జిల్లా పిచ్చా టూరు మండలం అడవికోడియంబేడు గ్రామంలో ఒంటరి మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్లు స్థానికులు తెలిపారు
స్థానికుల కథనాలు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అడవికోడియంబేడు గ్రామానికి చెందిన కల్పన 40 సం” ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు రాత్రి ఆమెను గొంతు కోసిహత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు చైను, గొలుసులు దొంగతనం చేసుకుని వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు
విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
పంచనామా నిమిత్తం సత్యవేడు ఏరియా హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు