ఏకరూపదుస్తులు నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎంఈఓ నాగేశ్వరరావు
ప్రశ్న ఆయుధం 19 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లను ఎంఈఓ నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ…విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్ కు హాజరై ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని పెట్టాలని సూచించారు.మాజీ ఎంపీటీసీ భర్త దేవేందర్ రెడ్డి స్కూల్ లో స్టాఫ్ కొరత ఉందని అడిగిన వెంటనే ఒక ఉపాధ్యాయుని డిప్యూటేషన్ పాఠశాలకు రెండు మూడు రోజుల్లో పంపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పెద్ద పట్లోళ్లదేవేందర్ రెడ్డి బాన్సువాడ మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ నేర్రెల నర్సింలు ఉపాధ్యాయులు సాయిరాం మహాదేవ్ బొర్లం మాజీ ఎంపీటీసీ సభ్యులు మన్నె విట్టల్ బోర్లంమజీద్ కమిటీ మాజీ సదర్ షేక్ మహబూబ్ మాజీ వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల సాయిలుమాజీ వార్డు సభ్యులు మన్నే నాగభూషణం మరో వార్డు సభ్యులు ఎర్రోళ్ల బాలు ఎస్ఎంసి చైర్మన్ మన్నే నగవ్వ సూకురు అశోక్ మన్నేబాగయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.