జూన్‌లోనే పూర్తి చేయాలి: మేడ్చల్ జిల్లాలో 1,409 ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు కలెక్టర్ ఆదేశం

**జూన్‌లోనే పూర్తి చేయాలి: మేడ్చల్ జిల్లాలో 1,409 ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు కలెక్టర్ ఆదేశం**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 20

మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన 1,409 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 516 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగిలిన 900 ఇళ్లను ఈ నెలాఖరు లోగా వందశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించి, నిర్ధారణ గ్రౌండింగ్‌ చేయాలని గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లకు సూచించారు. మిగిలిన 900 ఇళ్ల గ్రౌండింగ్ కోసం 8 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు (ఏఈలు) ఒక్కొక్కరికి 125 ఇళ్ల చొప్పున బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వారందరూ వచ్చే వారంలోగా ఇంటింటికీ వెళ్లి గ్రౌండింగ్ జరగేలా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.ఇక జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్థానిక కోటా కింద మంజూరైన 1,000 2 పరగల గది ఇళ్లను ఎల్-2 జాబితాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల బేస్‌మెంట్ నిర్మాణానికి ఆర్థికంగా వెనుకబడి ఉన్న లబ్ధిదారులను మహిళా సంఘాలలో చేర్చించి, వారికి లక్ష రూపాయల రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి రాధికా గుప్త, జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ రమణ మూర్తి, డీఈలు, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment