*నాగారంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 20
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగారంలోని శివాలయం పక్కన ఉన్న స్టార్ ఫంక్షన్ హాల్లో రేపు (జూన్ 21, శనివారం) ఉదయం 6:00 గంటల నుండి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, ఆయనే ప్రేరణగా, గత పదేళ్లుగా యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ నిర్వహించబడుతోంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా, భారత సంప్రదాయాన్ని, సంస్కృతిని మరియు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ యోగా దినోత్సవం 208 దేశాలలో జరుపుకుంటున్నారు.
నాగారం ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ యోగా ప్రతినిధులు, నాగారం ప్రాంత ప్రముఖులు, కాలనీల అధ్యక్షులు, భాజపా కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారు. అంతటా యోగా ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా ఈ వేడుకలు సాగనున్నాయి.
ఈ సందర్భంగా కౌకుంట్ల చంద్ర రెడ్డి ప్రజలందరిని హాజరై యోగాలో పాల్గొని ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవాలని కోరారు.