దుర్కి పీర్ల చెరువు వద్ద యోగా దినోత్సవం
ప్రశ్న ఆయుధం 21 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)
నాశ్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామ శివారుల్లోని పీర్ల చెరువు గంగమ్మ గుడి దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగా నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత మాట్లాడుతూ…మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొంది. నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.ఇది శారీరక,మానసిక,ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగించే అద్భుతమైన ప్రక్రియ.శరీరం,మనసు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడంతోపాటు ఆరోగ్యకర జీవితానికి బాటలు వేస్తుంది. శారీరక దృఢత్వం కలిగించడంతోపాటు జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ,రోగనిరోధక శక్తిని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏఎన్ఏం ఉమాదేవి డాక్టర్ భవ్య ఆశ కార్యకర్త పార్వతి క్షేత్ర సహాయకులు స్వామి కపిల్ తదితరులు పాల్గొన్నారు.