జర్నలిస్టుల కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, జూన్ 21::
కలెక్టరేట్ ప్రాంగణంలో జర్నలిస్టుల కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.యన్. చారి జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డి.ఎల్.యన్. చారి మాట్లాడుతూ,
జిల్లాలో పనిచేస్తున్న పత్రికా విలేకరులందరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం అత్యవసరంగా ఉంది. జిల్లా స్థాయిలో జరుగుతున్న సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను కవరేజీ చేయడం కోసం కలెక్టరేట్ను పలుమార్లు జర్నలిస్టులు సందర్శించాల్సి వస్తోంది. అలాంటి సందర్భాలలో ఒక ప్రత్యేకమైన మీడియా పాయింట్ అందుబాటులో ఉంటే విలేకరులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ఫీల్డ్లో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు,
హెల్త్ కార్డులు అందజేయాలని
అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.