వైసీపీలో అంతా “జీనియస్”లే – వాళ్లకు ఆ రికార్డులే గొప్ప!
యోగాంధ్ర గిన్నిస్ రికార్డులు సాధించడం వైసీపీతో పాటు ఆ పార్టీ మీడియాకు కడుపు మంట ఎక్కువగా ఉంది. ఆ పత్రిక మాజీ ఎడిటర్ వర్దెల్లి మురళీ లాంటి వాళ్లు గిన్నిస్ రికార్డుల్ని తక్కువ చేస్తూ కథనాలు రాసేశారు. ఇక సోషల్ మీడియా కార్యకర్తల సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే వీరు గతంలో జీనియస్ బుక్ రికార్డులు అంటూ హడావుడి చేసిన సంగతి మర్చిపోయారో.. మర్చిపోయినట్లుగా నటిస్తున్నట్లుగా ఉన్నారో అర్థం చేసుకోవడం కష్టం.
అధికారంలో ఉన్నప్పుడు ఓ జగన్ పుట్టిన రోజు నాడు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో లక్షా ఇరవై మంది మంది రక్తదానం చేశారని జీనియర్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కినట్లుగా ప్రకటించుకున్నారు. సాక్షిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ గురించి విన్నాం.. లిమ్కా బుక్ గురించి విన్నాం.. మరి జీనియస్ బుక్ ఎక్కడిదని ఇతరులకు డౌట్ వచ్చింది.
లిక్కర్ స్కామ్ చేసి.. ఒరిజినల్ బ్రాండ్లు ఉన్నట్లుగా ఫేక్ బ్రాండ్లు సృష్టించినట్లుగా ఈ జీనియస్ రికార్డునుకూడా సృష్టించారు. అచ్చంగా గిన్నిస్ రికార్డులా ఉండేలా ఫేక్ చేసి సర్టిఫికెట్ సృష్టించారు. దాని మైక్ అనే పేరుతో సంతకం… అంతకు మించి.. ఓ బార్ కోడ్ కూడా ఇచ్చారు. నిజానికి జీనియస్ బుక్ అనేదే లేదు. అంతకు మించి ఆ రికార్డు ప్రకటించిన వ్యక్తి… విశాఖలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నడుపుకునే వ్యక్తి. వీరుమామ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేసుకునే వ్యక్తి.. ఈ జీనియస్ ఫేక్ రికార్డును వైసీపీకి ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లో ఉన్న డీటైల్స్ కూడా చూసి.. ఇంత అమాయకంగా ఫేక్ చేస్తారా అని సామాన్యులు కూడా ఆశ్చర్యపోయారు.
ఆన్ లైన్ లో రక్తదానం అంటే.. భవిష్యత్ లో ఎప్పుడైనారక్తదానం చేస్తానని హామీ ఇవ్వడం. దాన్ని కూడా రక్తదానం చేసినట్లుగా చేసి రికార్డు రాసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ రికార్డును గిన్నిస్ రికార్డుగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అలాంటిది జీనియన్గా గిన్నిస్ ప్రతినిధులు వచ్చి గిన్నిస్ రికార్డు ఇస్తే.. వైసీపీ నేతలు, సోషల్ మీడియా, మీడియా తెగ గింజుకుంటున్నారు. వీళ్లకు ఫేక్ జీనియస్ అవార్డే కరెక్టని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి