ప్రజావాణి ప్రతి దరఖాస్తు పై చర్యలు తీసుకోవాలని

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.
పాల్వంచకు చెందిన మడిపల్లి నందిని భర్త అశోక్ తాను ముగా మరియు చెవులు కూడా వినపడవు అని తాను పదో తరగతి వరకు చదువుకున్నానని, నిరుపేద అయిన తనకు సొంత ఇల్లు లేదని, కుటుంబ పోషణ కోసం ఏదైనా ప్రభుత్వ ఆఫీసులో చిన్నపాటి ఉద్యోగం కల్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎండార్స్ చేశారు.పాల్వంచ మండలం రంగాపురం గ్రామానికి చెందిన బానోతు ఉపేందర్ తమది నిరుపేద కుటుంబమని, తమ కుమారుడికి గురుకులంలో సీటు కోసం టీ జి సెట్ పరీక్ష రాయాలని తెలియదని తమకు దగ్గరలో ఉన్న భద్రాచలం బీసీ గురుకుల వసతి గృహంలో ఆరో తరగతి అడ్మిషన్ ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా వెనుకబడిన తరగతుల అధికారికి ఎండార్స్ చేశారు.బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు తండ్రి హుస్సేన్ లక్ష్మీపురం గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలో సుమారు1000 మంది కార్మికులు నివసిస్తున్నారని, వారి అవసరాలు తీర్చడం కోసం లక్ష్మీపురం గ్రామంలో సంత నిర్వహణకు పంచాయతీ వారు అనుమతి ఇచ్చారని, బూర్గంపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు పోలీసు శాఖ పర్యవేక్షణ కొరకు దరఖాస్తు చేసిన సదరు పోలీసు శాఖ అధికారులు స్థల పరిశీలన చేయడం లేదని అనేకసార్లు లక్ష్మీపురం సంత అనుమతి కోసం పోలీసు శాఖ వారిని సంప్రదించటం జరిగిందని కావున సమస్యను పరిష్కరించి పోలీసు వారు స్థలం పరిశీలన జరిపి సంత పెట్టుకొనుటకు అనుమతించే విధంగా చర్యలు చేపట్టగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఓ ఎస్ డి కి ఎండార్స్ చేశారు.అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ బి. జి కొత్తూరు గ్రామానికి చెందిన మర్రి కృష్ణారెడ్డి తండ్రి వెంకటరెడ్డి అశ్వాపురం మండలం నెల్లిపాక రెవిన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 433/8 0-30 కుంటలను బి. జి కొత్తూరు గ్రామం వాస్తవ్యులు అయినా మర్రి సోమిరెడ్డి తండ్రి నారాయణ రెడ్డి గారి దగ్గర 17.07.2019 నా క్రయం పొంది మరియు సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం బూర్గంపాడు నందున తన పేరున రిజిస్ట్రేషన్ కాబడినదని కావున తన స్వాధీనంలో గల భూమికి రెవెన్యూ వారి నుండి తన పేరు న పట్టాదారు పాసుబుక్ మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం అశ్వాపురం తాసిల్దార్ కి ఎండార్స్ చేశారు.కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీకి చెందిన జాడి సాంబలక్ష్మి భర్త సోమయ్య మాకు మొదటి విడత లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనదని మా దగ్గర నుండి పంచాయతీ సెక్రటరీ మరియు ఏఈ గారు వచ్చి ఫోటోలు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఇంటి స్థలం కూడా చూసుకొని వెళ్లారని అందరితో సమానంగా ఇల్లు వస్తుందని సెక్రటరీ చెప్పారని మళ్లీ సెక్రటరీ గారిని అడగగా ఇందిరమ్మ కమిటీ వాళ్లు తీసేసారని చెప్పారు. గత సంవత్సరం తుఫాన్ సమయంలో మా పెంకుటిలో నుండి వరద సుమారు నాలుగు అడుగుల ఎత్తు నుండి వరద పోవడం వల్ల ఇల్లు గోడలు మరియు ఇల్లు కుంగిపోయినదని తాసిల్దార్ , ఎంపీడీవో గార్లు వచ్చి మీకు ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఇందిరమ్మ కమిటీ వారు మా పేరును మంజూరైన ఇల్లును తొలగించారని విచారణ చేయించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం పిడి హౌసింగ్ అధికారికి ఎండార్స్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment