ఓరీ దేవుడో… ఇదేం రైలుబండిరా సామీ.. ఇందులో ప్రయాణికులు కూర్చొనే అలిసిపోతారట.!

*ఓరీ దేవుడో… ఇదేం రైలుబండిరా సామీ.. ఇందులో ప్రయాణికులు కూర్చొనే అలిసిపోతారట.!*

భారతదేశంలో ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. ఇవి 7300 కి పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ రైళ్లలో కొన్ని సుదూర రైళ్లు అయితే, కొన్ని రైళ్లు చాలా తక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. కానీ, మనదేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుండి కూడా అలసిపోతారు. ఎందుకంటే ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు దాదాపు 4200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుందట.

భారతదేశంలో ఈ ప్రత్యేకమైన రైలు పేరు వివేక్ ఎక్స్ప్రెస్. దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ ప్రయాణిస్తుంది. వారానికోసారి పట్టాలు ఎక్కుతున్న ఈ వివేక్ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుందట. ఈ రైలు మార్గంలో సుమారుగా 50 స్టేషన్లు ఉన్నాయట.

Join WhatsApp

Join Now

Leave a Comment