1. పెళ్లైన నెలకే భర్త హత్య… ప్రేమ పేరిట మోసం!
2. నవ వధువు చేతిలో నవ వరుడి ప్రాణాలు!
3. నువ్వంటే ఇష్టం అనీ… ప్రాణం తీసింది!
4. మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘోరం గద్వాలలో!
5. ప్రేమికుడితో కలిసి భర్తను చంపిన భార్య!
6. సర్వే పేరుతో భర్తను కారులో గొంతు కోసి హత్య
7. తల్లీకూతుళ్ల కుట్ర… పెళ్లి అయిన నెలకే ప్రాణం తీసిన పథకం!
నవ వధువి చేతులమీదే నవ వధువు హత్య?ఘోరం.. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్త ప్రాణాలు తీసిన భార్య
గద్వాల/కర్నూలు:ప్రశ్న ఆయుధం:నువ్వంటే ఇష్టం..’ అని బతిమిలాడి వివాహం చేసుకున్న యువతి, పెళ్లైన నెల రోజులోనే భర్తను హత్య చేయించిందన్న విషాద ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
పెళ్లికి ముందు నుంచే బ్యాంకు ఉద్యోగితో సంబంధం
గద్వాలకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఇతడు కర్నూలుకు చెందిన ఐశ్వర్యను మే 18న వివాహం చేసుకున్నాడు. కానీ, పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం ఉండటంతో, వివాహం తర్వాత కూడా అతనితో టచ్లోనే ఉండేది. తేజేశ్వర్పై అనుమానం పెరిగిన వెంటనే వివాహం తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి.
అడ్డు వస్తున్నాడని హత్యకు ప్లాన్
పోలీసుల అనుమానం ప్రకారం – ఐశ్వర్య, ఆమె ప్రియుడు తేజేశ్వర్ ను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళిక ప్రకారం జూన్ 17న సర్వే పనిపై తీసుకెళ్లినట్టు నమ్మించి, కారులోనే కత్తులతో దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. అనంతరం పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద మృతదేహాన్ని పడేసినట్టు గుర్తించారు.తల్లీకూతుళ్ల పాత్ర, బ్యాంకు ఉద్యోగి పరారిలో ఘటనలో ప్రధానంగా ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాత పాత్ర కూడా బయటపడింది. సుజాత కూడా అదే బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. ఆమెకూ, ఆమె కుమార్తె ప్రేమికుడికీ సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఐశ్వర్య తన ప్రియుడితో పెళ్లైన తర్వాతే 2 వేల సార్లు ఫోన్ మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో గుర్తించారు. తేజేశ్వర్ హత్యకు ఈ బ్యాంకు ఉద్యోగి సుపారీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.అరెస్టులు, దర్యాప్తు కొనసాగుతూనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న గద్వాల పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను అరెస్టు చేశారు. ఇంకా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు ఉద్యోగి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ మేరకు గద్వాల సీఐ శ్రీనును వివరణ కోరగా “దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నది. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం” అని తెలిపారు.