జగదీష్ అన్న పిలుపుమేరకు 5కే రన్లో పాల్గొన్న శిరీష సత్తూర్

*జగదీష్ అన్న పిలుపుమేరకు 5కే రన్లో పాల్గొన్న శిరీష సత్తూర్*

ప్రశ్న ఆయుధం జూన్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ భారతదేశంలో జరుగుతున్న విషాద సంఘటనలు కారణంగా తమ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ, స్థానిక బొటానికల్ గార్డెన్లో 5కే రన్ను ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరిగిన సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మన ప్రియతమ నాయకులు జగదీష్ గౌడ్ పిలుపుమేరకు శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ 5కే రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీకృష్ణ యూత్ కాంగ్రెస్, టీం వీజేజి, బాల బాలికలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment