రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి ఉండగా, రూ.6000 రైతుబంధు పథకం కింద జమ చేసిన ప్రభుత్వం
రైతుబంధు డబ్బు ఇవ్వమని తన చిన్న కొడుకు సంతోష్ అడగడంతో, ఆరోగ్యం బాగాలేక రూ.2000 ఖర్చు చేశానని మిగతా రూ.4000 ఇస్తానని చెప్పిన తండ్రి కీర్యా
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యి, తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేసిన సంతోష్
తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు