యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ   

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ

యువత మత్తు పదార్థాలకు దూరంగా లేకుంటే కఠిన చర్యలు తప్పవు

చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ బి రాజు నాయక్

ప్రశ్న ఆయుధం తెలంగాణ బ్యూరో :అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి డివిజన్లో చిక్కడపల్లి పోలీస్ సహకారంతో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం ను పురస్కరించుకొని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ముఖ్యఅతిథిగా అప్స స్వచ్ఛంద సంస్థ వివిధ స్థానిక స్వచ్ఛంద సంస్థల యువతి యువకులు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ నుండి గ్రంథాలయం వరకు మహా ర్యాలీ నిర్వహించడం జరిగినది మత్తు పదార్థాలు వద్దు మన ఆరోగ్యమే ముద్దు మత్తు పదార్థాలను మానేద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుదాం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిదానాలతో ఓరి తీస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రాజు నాయక్ మాట్లాడుతూ నేటి యువతలో ప్రతి వంద మందిలో పదిమంది యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని నేటి యువత తమ లక్షణాలను నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజం చేయడమే ఉద్దేశంతో ఎక్కడ గాని గాంజా కోకఇన్ మత్తు మత్తు సిరప్ సిగరెట్లలో గుట్కాలు మత్తు చాక్లెట్లు యువత ఎవరైనా వాడుతుంటే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని మరియు1446 గాని 1908 గాని ఉచిత కాల్ చేయండి అని అన్నారు నేటి యువత ఆరోగ్యమే రేపు మన రాష్ట్ర అభివృద్ధికి దోహత పడుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన అప్స స్వచ్ఛంద సంస్థ సహాయకోడినేటర్ ముస్తాల లావణ్య కు మరియు అప్స స్వచ్ఛంద సంస్థ అధికారులకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అప్సా స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు చెడు మార్గాలు వెళ్లకుండా 50 బస్తీలలో నైపుణ్య శిక్షణలు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము అన్నారు తదనంతరం

కార్యక్రమంలో సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బసవరాజు మాట్లాడుతూ అప్స స్వచ్ఛంద సంస్థ ద్వారా యువతలో మార్పు రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ కార్యక్రమాలే కాకుండా వెనుకబడిన ఏరియాలలో పిల్లలని బడిలో చేర్పిస్తూ బస్తీలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మా అప్స స్వచ్ఛంద సంస్థ ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి డిప్యూటీ ఇన్స్పెక్టర్ శంకర్ సబ్ ఇన్స్పెక్టర్ అభిలాష్ జంగయ్య శివ ప్రసాద్ గంగాధర్ అప్స స్వచ్ఛంద ప్రతినిధులు మంజుల రాజేశ్వరి శోభ ఇందిరా మల్లిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ ప్రతినిధి శ్రీలత పిఎస్ కమిటీ సభ్యుడు కాదిల్ మల్లేష్ జనని ఫౌండేషన్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment