*17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య.*
*ప్రశ్న ఆయుధం, జూన్ 26, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
బిల్లింగ్ పైనుంచి దూకి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఓ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37) కు 9 నెలల క్రితమే పెళ్లయింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. కాగా మదన్ మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకుంటున్నాడు. అదే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.