జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న చంద్రరెడ్డి, శ్రీనివాస్ గౌడ్

**జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న చంద్రరెడ్డి, శ్రీనివాస్ గౌడ్**

*ఇస్కాన్ ఆధ్వర్యంలో రాంపల్లిలో ఘనంగా నిర్వహించిన ఉత్సవం*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 27

శుక్రవారం రోజు రాంపల్లిలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి , మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ , రవీందర్ రెడ్డి , ఇతర స్థానిక నాయకులు పాల్గొని భక్తులతో కలిసి రథయాత్రను శోభాయమానంగా మార్చారు.

ఈ సందర్భంగా వారు భగవంతుడి ఆశీర్వాదాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయకారాలతో మార్మోగిన ఈ రథయాత్ర ప్రాంత ప్రజలలో ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment