రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం.

 

– డెంగ్యూ బాధితునికి సకాలంలో బీ పాజిటివ్ రక్తం అందజేసిన ముదాం ప్రవీణ్.

 

– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 27

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న నరేష్ (30) కు బి పాజిటివ్ రక్త కణాలు అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన ముదాం ప్రవీణ్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ప్రవీణ్ కు అభినందలు తెలియజేశారు. ప్రస్తుతం వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వారికి సకాలంలో తెల్ల రక్తకణాలు అందజేయకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనీ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment