కల్తీకల్లుకు వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ అధికారులు

కల్తీకల్లుకు వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ అధికారులు

నీర అమ్ముదామంటే టీ.ఎఫ్.టీ లైసెన్స్ ఇవ్వనంటున్నా ఎక్సైజ్ సీఐ…

అసలైన గీత కార్మికులకు న్యాయం జరిగేదెలా…!

బెదిరింపులకు గురి చేస్తున్న అబ్కారీ సీఐ యాదగిరి రెడ్డి…

న్యాయం జరగకపోతే ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు సేవించి చస్తానన్న బాధితుడు విట్టల్ గౌడ్…

బాన్సువాడ ఎక్సైజ్ సీఐ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడి ఆరోపణ…

ప్రశ్న ఆయుధం 28 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులాన్ పల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు విఠల్ గౌడ్ కు కొత్తబాదికి సంబంధించిన గౌడ సొసైటీ లో లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో విట్టల్ గౌడ్ కు మొగులాన్ పల్లి శివారులో ఆయన సొంత పొలంలో హరితహారంలో భాగంగా 500 ఈత చెట్లు ప్రభుత్వం ఇవ్వగా అదనంగా 700 ఈత చెట్లు ఆయన కొనుగోలు చేసి మొత్తము 1200 ఈత మొక్కలు ఆయన ఒక ఎకరం పొలంలో నాటానని వాటికి సంరక్షిస్తూ 10 సంవత్సరాలుగా పెంచి పెద్ద చేసిన తర్వాత గీత గీయడానికి వచ్చాయని టి.ఎఫ్.టి లైసెన్స్ ద్వారా,పివ్వర్ కల్లు,నీరా కట్టి అమ్ముకుందామంటే నాకు లైసెన్స్ ఇవ్వకుండా కొత్తబాది సొసైటీకి అమ్ముకో అనీ బాన్సువాడ ఎక్సైజ్ సీఐ అనడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీ తరపున 3000 రూపాయలు ఇస్తారు తీసుకోమని సీఐ చెప్పడం గమనార్హం.నా స్వంత పొలములోని ఈత చెట్లు వేరె వాళ్లకు అప్పనంగా కట్టబెట్టడం వెనకాల మతలబు ఏమిటి అని నాలాంటి అసలైన గీత కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.నాకు న్యాయం జరగకపోతే నా భార్య పిల్లలతో సహా ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు తాగి చస్తానని బాధితుడు ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment