మాచారెడ్డి మండల మైనార్టీ మాజీ అధ్యక్షుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 28
బి ఆర్ ఎస్ పార్టీ మాచారెడ్డి మండల మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షులు జహంగీర్ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం గజ్యానాయక్ తాండలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి 25000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహంగీర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసనిచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి మినికురి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు పగడల బల్చంద్రం, ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, గోవింద్ రెడ్డి, ,శ్రీకాంత్ రెడ్డి, గజ్యానాయక్ తండా స్థానిక మాజీ సర్పంచ్ హాంజినాయక్, ఉప సర్పంచ్ తోకల కిషన్, మాజీ మండల కాప్షన్ అబ్దుల్ ఖాన్, గ్రామ జనరల్ సెక్రటరీ భూక్యా భాస్కర్, మాచారెడ్డి యూత్ అధ్యక్షుడు చల్ల కృష్ణ, కకుల గుట్ట మాజీ సర్పంచ్ హేమాల నాయక్, లాచాపేట ఎంపీటీసీ బుస శ్రీనివాస్, ఘన్పూర్ ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, అక్కపూర్ మాజీ ఎంపీటీసీ రమేష్, జేసీబి దేవరాజు, నాగరాజు, అజీజ్, తుమ్మ శ్రీనివాస్, అగుళ్ల లీల తదితరులున్నారు.