కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 28 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ ప్రజలకు మిషన్ భగీరథ వాటర్,సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులకు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కొబ్బరికాయలు కొట్టి అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.పెనుబల్లి గ్రామపంచాయతీ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ ప్రతి ఇంటికి అందించాలని రూ,,49 లక్షల వ్యయంతో మంచినీటి కొరత లేకుండా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో, అదేవిధంగా సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణానికి రూ,,33 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామానికి మంచినీటి సౌకర్యం, సిసి రోడ్లు,డ్రైనేజీ పనులుచేపట్టాలన్నారు.ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఈ జె నాగేందర్, ఎమ్మార్వో కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో సుభాషిణి, మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీను, పంచాయతీ సెక్రెటర్ కే కార్తీక్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఇనుముల నరసింహారావు, ధనసలపూడి భాస్కర్, కత్తి నాగయ్య, సిపిఐ పార్టీ నాయకులు కంటే వెంకటేశ్వర్లు, దసలపూడి శేషయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
by Naddi Sai
Published On: June 28, 2025 9:55 pm
