పీవీ నరసింహారావు జయంతి వేడుకలో కాంగ్రెస్ నాయకులు

*భూ సంస్కరణలోనూ అమల్లోకి తీసుకువచ్చిన ఘనత పివిది*

*ఆర్థిక వ్యవస్థకు పునర్జీవనం పోసిన మహానాయకుడు పివి*

*పీవీ నరసింహారావు జయంతి వేడుకలో కాంగ్రెస్ నాయకులు*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 28 ప్రశ్న ఆయుధం*

భూసంస్కరణములు తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు చెందుతుందని ఆర్థిక వ్యవస్థకు పునర్జీవనం పోసి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చిన నాయకుడు పీవీ నరసింహారావు అని అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణంలో నిర్వహించిన పీవీ నర్సింహారావు జయంతి వేడుకలో కాంగ్రెస్ నాయకులు కొనియాడారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గరుడ చౌరస్తాలో ఏర్పాటుచేసిన పివి జయంతి వేడుకల్లో పివి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు నిజాయితీ నిబద్ధత గల నాయకత్వం అందరికీ ఆదర్శనీయమని పీవీ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు మరువలేనివని పి.వి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీ గా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు పీవీ నరసింహరావు ఆని తెలిపారు పి.వి. నరసింహారావుకు 2024 ఫిబ్రవరి 9న భారతరత్న పురస్కారం వచ్చిందని వివిధ భాషల్లో అనర్గంగా ప్రసంగించే వ్యక్తిత్వం గల నాయకుడు పివి అని తన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయని ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయని దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడని తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కీ పూర్తి స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడని ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారని తెలిపారు

పీవీ స్ఫూర్తితో ముందుకు సాగితే అనేక విజయాలు సాధించవచ్చని తన ఆలోచనలు, ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే ఇంగిలే రామారావు, కనుమల్ల సంపత్, ఎక్కేటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, పెద్ది శివకుమార్, గూడెపు ఓదెలు, మారేపల్లి ప్రశాంత్, గంగారం మహేష్, ధర్మకర్తలు గొడిశాల పరమేశ్వర్, గోలి కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి మల్లయ్య మ్యాడదా తిరుపతిరెడ్డి, మరి వీరారెడ్డి, బుర్ర రమేష్ బీనవేణి మహిపాల్ యాదవ్ ఆరే రమేష్ రెడ్డి పిట్టల సతీష్, రెడ్డి సారంగం ఆకునపల్లి వెంకటేష్, జిల్లా జలంధర్ రెడ్డి, భోగం పృథ్వీరాజ్, కంగాటి శ్రీనివాస్ రెడ్డి, తాడెం దిలీప్, మారేపల్లి వంశీ, పెద్ది అభిలాష్, మంకు ఐలయ్య, ఉప్పుల ఆయిల్ రెడ్డి, మారేపల్లి రమేష్, కొత్తూరు రాజేందర్, వేముల తిరుపతి, జక్కు కుమారస్వామి, మోత్కూరు శ్రీనివాస్, తాళ్లపల్లి వెంకటేష్, తట్ల కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment