సింధు స్కూల్ విద్యార్థులకు పురస్కార్ అవార్డులు
ప్రశ్న ఆయుధం 29 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని సింధు స్కూల్ విద్యార్థులకు జాతీయ సేమ్స్ ఓలంపియాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలకు గాను జాతీయ స్థాయిలో 9వ తరగతి చదువుతున్న సాయి శృతి కి రాష్ట్ర స్థాయిలో ముగ్గురు విద్యార్థులకు ప్రవీణ్య పురస్కార్ అవార్డు లభించింది.శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సేమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్ రెడ్డి ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి విద్యార్థులకు అవార్డు మెమొంటో మెడల్స్ ను అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగన్ మాట్లాడుతూ…విద్యార్థులకు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా స్కూల్ యాజమాన్యం ఎల్లపుడు తోడుగా ఉంటుందని ఆయన తెలిపారు. తమ స్కూల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకుగాను విశేష పురస్కారం అవార్డు లభించిందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో స్కూల్ యాజమాన్యం అకాడమిక్ ఇంచార్జి సింధు ప్రిన్సిపాల్ జగన్ తదితరులు పాల్గొన్నారు.