సేవల కృషికే అవార్డులు….. రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ అధ్యక్షులు తుమ్మ కృష్ణ.
నిరంతరం పని చేస్తూ పోతే సమాజంలో గుర్తింపుతో పాటు అవార్డులు రావడం సర్వ సాధారణమని రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ అధ్యక్షులు తుమ్మ కృష్ణ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని కొంపల్లి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రెండు అవార్డులు, మూడు సర్టిఫికెట్లు, అందజేశర ని అన్నారు. గత సంవత్సర కాలంగా పాఠశాలలో యోగా అభ్యాసం, పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అనేక కార్యక్రమలు నిర్వహించడం మూలంగా ఈ అవార్డ్స్ రావడం జరిగిందన్నారు. అలాగే ప్రాచీన శ్రీ వరదరాజ స్వామి దేవాలయంలో శ్రమదానం తో పాటు గత ఐదు నెలలుగా శ్రమించి పున ప్రతిష్ట కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగిందనీ అన్నారు. అలాగే విద్యార్థులకు సైకిల్, మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం, ఉపాధ్యాయ దినోత్సవం తో పాటు వినాయక చవితికి మట్టి విగ్రహాలు అందజేసి పారిశుధ్యం పై అవగాహన కల్పించామన్నారు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు.సమయ భావం సరిపోనందున రోటరీ క్లబ్ సేవలు అందరికీ అంది ఇవ్వలేకపోయాము అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ సభ్యులు తమకు ఎంతో సహకరించడం మూలంగా ఈ అవార్డు రావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్, శరత్ చంద్ర, డిప్యూటీ గవర్నర్ నరసింహ, అసిస్టెంట్ గవర్నర్ వెంకన్న, గజ్వేల్ సెంటర్ రొటరీ క్లబ్ సీనియర్ సభ్యులు అడ్వకేట్ రమణ, సర్వే సత్యనారాయణ, ధర్మారం నరసింహారెడ్డి. మల్లేశం, జిల్లా రమేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు