ప్రముఖ వేద పండితులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో ఎస్ నాయకులు 

ప్రముఖ   వేద పండితులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో ఎస్ నాయకులు

 కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం) జులై 21

జిల్లాలోని ప్రముఖ   పండితులు నారాయణ శర్మ, ఆంజనేయ శర్మ కు కామారెడ్డి జిల్లా టిఎన్జీవోఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన వారి యొక్క బృందం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ వేద పండితులు అయినటువంటి తండ్రి కొడుకులు నారాయణ శర్మ, ఆంజనేయ శర్మ జన్మదినన్ని పురస్కరించుకొని అతనిని జిల్లా కేంద్రంలోని సంకష్ట గణపతి దేవాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మాలను వేసి టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆంజనేయ శర్మ అర్చన చేసి కామారెడ్డి జిల్లా ఉద్యోగులు సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని  భగవంతుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, అర్బన్ తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment