*ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. 8 జిల్లాలలో 14 మండలాలను కలుపుతూ అలైన్మెంట్*
తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకారం తెలిపింది.
దేశంలోనే మెుట్టమెుదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలు,14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టనుంది. రూ.12,070 కోట్లు వ్యయంతో చేపట్టబోయే ఈ ఔటర్ రింగ్ రైలు 26 కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి, రవాణా మెరుగుదలకు కీలకం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
*ఔటర్ రింగ్ రైలు వెళ్లే 8 జిల్లాలు ఇవే*
మెదక్
సంగారెడ్డి
వికారాబాద్
రంగారెడ్డి
మహబూబ్ నగర్
నల్గొండ,
యాదాద్రి-భువనగిరి
సిద్ధిపేట
*ఔటర్ రింగు రైలు ఎలైన్మెంట్*
ఆలేరు
వలిగొండ
గుళ్లగూడ
మాసాయిపేట
గజ్వేల్ మీదుగా ఔట్ రింగ్ రైల్ ఎలైన్మెంట్ ఖరారు కానుంది.
హైదరాబాద్ రీజినల్ రింగు రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టుకు రూ.12,070 కోట్లు వ్యయం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా. రాష్ట్రంలోని 8 జిల్లాలు, 14 మండలాల పరిధిలో చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది.
*26 స్టేషన్లతో ఫైనల్ ఎలైన్మెంట్*
*ఈ 6 చోట్ల ROR వంతెనలు*
మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
రెండేళ్ల క్రితం 508 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రైలు మార్గంను ప్రతిపాదించడం జరిగింది. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెుదటి ప్రతిపాదన 5.8.45 కిలోమీటర్లు, రెండో ప్రతిపాదన 512.51 కిలోమీటర్లు, మూడో ప్రతిపాదన 392.02 కిలోమీటర్లుగా దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. అయితే కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్రెడ్డిలు ఈ మూడు ప్రతిపాదనలను పరిశీలించారు. అయితే మెుదటి రెండు ప్రతిపాదనలు రీజినల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని భావించారు. దీంతో మూడో ప్రతిపాదనకు అంగీకారం తెలపడం జరిగింది.
*మూడో ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్*
ఇకపోతే మూడో ప్రతిపాదన 392.02కు కేంద్రమంత్రులతోపాటు అధికారులు చర్చించి చివరకు దీనికి అంగీకారం తెలిపారు. ఈ మూడో ప్రతిపాదన వల్ల ఆర్ఆర్ఆర్కు 3-5 కి.మీ. దూరంలో ఉంటుంది. రెండు చోట్ల మాత్రం 11 కి.మీ. దూరం ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన వల్ల దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశాలున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈ 392.02 కిలోమీటర్ల రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు.
*ఔటర్ రింగు రైలుతో ప్రయోజనాలెన్నో*
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది అని అధికారులు, ప్రభుత్వం అంచనా. రీజినల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఈ ఔటర్ రింగు రైలు మార్గాన్ని తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో కూడిన రవాణా ఆధారిత అభివృద్ధి స్పీడు అందుకోనుంది. ఈ ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది…