*35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసింది..!!*
*భర్తను పిల్లలను వదిలి ప్రియుడి కోసం నగరానికి చేరుకుంది.*
*ఆ తర్వాత ఏం జరిగిందంటే?*
35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత, 22 ఏళ్ల వయసున్న ఓ..యువకుడితో ఫోన్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది *ప్రియుడి మోజులో భర్త పిల్లలను విడిచి అతనితో వెళ్లిపోయింది.* విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి భైక్ పై వెల్తున్న ఇద్దరిని అడ్డగించాడు.. దీంతో భైక్ ను వదిలి పరారైన సంఘటన *గత నెల 5 వ తేదిన పేట్ బషీరాబాద్ పీఎయస్ పరిదిలో చోటుచేసుకుంది.*
*ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి (22 ) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు.* కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫోన్ యాప్ లో గోపికి *వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన సుకన్య (35) పరిచయం అయింది.* వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన *భర్త జయరాజ్ (38 )సుకన్యను మందలించాడు.* ఈక్రమంలో *గత నెల 5 వతేదిన సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది.* ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది. నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. *ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు.* చివరిసారిగా బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. *యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.* కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.