మాక్ డ్రిల్‌తో విపత్తు సన్నద్ధతకు మెరుగైన పరీక్ష

మాక్ డ్రిల్‌తో విపత్తు సన్నద్ధతకు మెరుగైన పరీక్ష

వరదలు, ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించిన జిల్లా యంత్రాంగం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22 

కేంద్రంలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వరదలు, అగ్నిప్రమాదాలు తదితర విపత్తులను ఎదుర్కొనే ముందస్తు సిద్ధతలో భాగంగా ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌ను చేపట్టినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానం, సహాయక చర్యలు అన్నింటినీ ప్రత్యక్షంగా అమలు చేసి చూపించారు.

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించిన ఈ వ్యాయామంలో భాగంగా EOC సందేశాలు, సైరన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ల ద్వారా విపత్తు సంభవించినట్లు అనుకరణ చేశారు. జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం (DEOC) పూర్తి స్థాయిలో పనిచేసి, వైర్‌లెస్, SATCOM, HAM వంటి ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించారు.

అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టి, NCC, హోమ్ గార్డులు, వాలంటీర్లతో కమ్యూనిటీ ఆధారిత ప్రతిస్పందన వ్యవస్థను సక్రియం చేశారు. SP కార్యాలయం పరిధిలోని ICP హెలిప్యాడ్, శ్రీరామ్ వీల్ టెక్, ESR గార్డెన్ జీఆర్ కాలనీ స్టేజింగ్ ఏరియా, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో రిలీఫ్ క్యాంపులు, ట్రయాజ్ సెంటర్లు, మెడికల్ ఎయిడ్ పోస్టులను యాక్టివేట్ చేశారు.

కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జీవదాన్ ఆసుపత్రులను అప్రమత్తం చేసి అత్యవసర వైద్య సేవలకు సిద్ధంగా ఉంచారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా భవిష్యత్తులో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే బలమైన జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపుదిద్దుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్, ఆర్డీఓలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment