భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్.
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశి అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీలో అక్టోబర్ 4 వ తారీఖు నుండి 13 వరకు జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొని మొత్తం 677.5 కేజీల బరువు ఎత్తడం జరిగింది.స్ట్రాంగెస్ట్ మాన్ అఫ్ వరల్డ్ మెరిట్ సర్టిఫికెట్ ను కూడా ఇవ్వడం జరిగింది.
బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్ విభాగాలలో లో మూడు బంగారు పతకాలు తో పాటుగా, పవర్ లిఫ్టింగ్ లో ఉత్తమ ప్రతభ కనపరిచినందుకు నాలుగో బంగారు పతకం సాధించడం జరిగింది.ఈ మోడెం వంశీ అనే గిరిజన క్రీడాకారుడు గతంలో కూడా యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని ఇండియాకు బంగారు పతకాలు తీసుకురావడం జరిగింది.ఈ బంగారు పతకాలు సాధించిన మోడెం వంశీని రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, ఉపాధ్యక్షుడు వి మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, పలు క్రీడా సంఘాలు, రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, మరియు పట్టణ ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి మోడెం వంశీని అభినందించడం జరిగింది.