కాలేజీలో విద్యార్థిని కత్తితో పొడిచిన సహ విద్యార్థి
కర్ణాటకలోని పుత్తూరు పట్టణంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి విషయంలో కాలేజీలో చదివే ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తోటి విద్యార్థిని మరో విద్యార్థి కోపంలో కత్తితో పొడిచాడు. గాయపడిన విద్యార్థిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు..