శ్రీవారిమెట్లు నడకదారిలో పురుగులమందు తాగిన ప్రేమజంట
శ్రీవారిమెట్లు నడకదారిలో ఓ ప్రేమ జంట పురుగులమందు తాగింది. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ ఓ యువకుడి ప్రేమలో పడింది. 3 రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడకమార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంటది చిత్తూరుటౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీశ్, రాధికలుగా పోలీసులు గుర్తించారు.