గజ్వేల్ లో ఘనంగా కైట్ ఫెస్టివల్
- సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్న సంక్రాంతి సంబరాలు
- ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, 13 జనవరి 2025 : సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి సంబురాలు అద్దం పడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలో కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి పర్వదినాలలో చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేయడం ప్రత్యేకతగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంతోషాల మధ్య గడుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అయితే మూడు రోజుల పాటు కనుమ, భోగి, మకర పండగలు నిర్వహించుకుంటూ ఉండగా కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేసుకోనున్నట్లు చెప్పారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాలకు పెట్టింది పేరని, అయితే ఆర్థికంగా నష్ట పోతుండడంతో తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం నిషేధించినట్లు పేర్కొన్నారు. అయితే అత్యంత ప్రమాదమైన చైనా మాంజ వినియోగించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూం రెడ్డి, ఆయా మండలాల పార్టీ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, కిష్టా గౌడ్, రవీందర్ రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కో ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, విజయలక్ష్మి సత్యనారాయణ, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మథిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హరినాథ్ గుప్త, కరుణాకర్ రెడ్డి, యాదగిరి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అంక్షా రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, జహీర్, రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, జగ్గయ్య గారి శేఖర్, సారిక శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శివులు, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.