నాగారం మున్సిపాలిటీలో వీర జవాన్లకు ఘన నివాళి

*నాగారం మున్సిపాలిటీలో వీర జవాన్లకు ఘన నివాళి*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 10

దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి సేవ చేస్తూ వీరమరణం పొందిన మురళి నాయక్ మరియు మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఘట్కేసర్‌కు చెందిన తిక్క సందీప్ ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణాలు అర్పించడం అత్యంత గొప్ప త్యాగం. మురళి నాయక్ వంటి వీరులు దేశానికి గర్వకారణం. ప్రతి భారత పౌరుడు సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా తీసుకోవాలి,” అని అన్నారు.

అలాగే, ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ‘సింధూర్ ఆపరేషన్’ ద్వారా పాకిస్తాన్‌కు భారత్ ఘాటైన సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. “దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రపంచ దేశాల నుండి మద్దతు లభిస్తోంది. దేశాన్ని రక్షించేందుకు సైనికులు చేస్తున్న త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి,” అని ఆయన అన్నారు.

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన తిక్క సందీప్ గురించి ఆయన మాట్లాడుతూ, “ఓ యువ జవాన్ మావోయిస్టుల క్రూరచర్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి మనం అండగా నిలవాలి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ముఖ్య అతిథి గణపురం శ్యాంసుందర్ శర్మ మాట్లాడుతూ, “దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యత. మతసామరస్యాన్ని కాపాడుతూ మనం భారతీయులమంటూ ప్రపంచానికి చాటి చెప్పాలి. మన శత్రువు పాకిస్తాన్, ఆ దేశంలోని ఉగ్రవాదులు మాత్రమే; మన దేశంలో మతాంతరంగా విభజన అవసరం లేదు. మనమంతా ఒకటే,” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మునిగంటి సురేష్, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బుధవరం లక్ష్మి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, వోల్లాల శ్రీనివాస్ గౌడ్, జూపల్లి నరేష్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వర్, సూర్య శేఖర్ రెడ్డి, మాధవరావు, సురేందర్ రెడ్డి, అల్లూరి శ్రీనివాసరాజు, ఏనుగు మహేందర్ రెడ్డి, రాకేష్ గౌడ్, భాను గౌడ్, సతీష్ రెడ్డి, శైలజ, కృష్ణవేణి, నరసింహ స్వామి, శ్రీరాములు, టెస్లా శ్రీనివాస్, రాజశేఖర్, పవన్, వినయ్ రెడ్డి, వెంకట్ చారి, భరత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment