కుప్పం…చిత్తూరు జిల్లా.
కుప్పంలో దారుణం. .
ప్రేమ జంటపై కత్తితో దాడిచేసిన కూతురు తండ్రి.
కుప్పం ఆర్.అండ్ బి గెస్ట్ హౌస్ లో పంచాయితీ చేస్తుండగా కత్తితో దాడి.
ప్రేమ జంట ఇరువురి కడుపులోకి కత్తితో పొడిచిన శీనప్ప.
పంచాయతీలోని మరో ఇరువురికి గాయాలు
ప్రేమ వివాహం చేసుకుందని పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీఅని పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి.
ఒకరి పరిస్థితి విషమం, కడుపులో ఇరుక్కుపోయిన కత్తి.
రక్తపు మడుగులో ఉన్న బాధితులనుఆసుపత్రికి తరలింపు.
భాధితులు గుడుపల్లి మండలం, అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్ప గా గుర్తింపు.
కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు .