చంద్రుగొండలో ఇల్లంగి. బాలకృష్ణ అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాలమృత వీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాలల బాధ్యుడు భేతి. నాగబాబు మాట్లాడుతూ వర్గీకరణ పోరాటంలో మరణించిన కోనంగి. శేషయ్య, దోమతోటి. నారాయణ, రెడ్డి. సత్యనారాయణ గార్లకు నివాళులు అర్పించి, మౌనం పాటించడం జరిగింది. వర్గీకరణ అనేది ప్రభుత్వం నిర్దిష్టంగా, ఆర్థిక సాంఘిక, సామాజిక, అనిచివేతల ను ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయాలని, బిజెపి, టిడిపి చంద్రబాబు, కిషన్ రెడ్డి, లాంటి వారికి రాబోయే రోజుల్లో మాలల నుంచి గుణపాఠం తప్పదని వారు అన్నారు. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ పరిగణలోకి తీసుకోకుండా, లోక్సభ చర్చ జరగకుండా తీర్పు ఎలా ఇస్తారని వారు అన్నారు. రాబోయే రోజుల్లో మాలలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో దాసరి బాబు, బడుగు. కృష్ణవేణి.బడుగు. శంకర్, బేతి. రాంబాబు, తాళ్లపల్లి. రాములు, తంబళ్ల. మంగయ్య, తలారి. నాగరాజు, భాష్యం. రాజు, బేతి. బాబు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు..