ఎంతోమంది ఉసురు.. ఇలా తగిలింది!
శ్రీనగర్లో బాదామీ బాగ్, పార్లమెంట్, పఠాన్కోట్, ఉరి, నగ్రోటా.. ఒకటా రెండా? ఎన్నెన్నో ఉగ్రదాడులు. ఎంతోమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుని వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన నరరూప రాక్షసుడు మసూద్ అజార్. జైషే మహ్మద్ సంస్థకు చీఫ్. అయినవారిని కోల్పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అతడికి తెలిసొచ్చింది. భారత్ చేసిన దాడిలో అతడి సోదరి, బావ, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు, మరో ఐదుగురు కుటుంబీకులు హతమయ్యారు.