ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నగొట్టి ముక్కుల గ్రామానికి చెందిన వడ్డే సుధాకర్ గత రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా, చిన్నాపూర్ గ్రామానికి చెందిన మన్నె రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు నాగయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు

Join WhatsApp

Join Now