చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..
కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
గాంధారి మండల కేంద్రానికి చెందిన వడ్డే శ్రీను తండ్రి పోచయ్య వయసు 70 సంవత్సరాలు నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాంధారి గ్రామానికి చెందిన కాటిపాకల లక్ష్మణ్ తో కలిసి నేరేల్ గ్రామ శివారులో గల చెరువు(కుంట)లో చేపలు, యేండ్రికాయలు పట్టడానికి వెళ్లి, అక్కడ వడ్డే శీను వల తీసుకొని చెరువులోకి దిగి వల చుట్టుకొని నీట మునిగి చనిపోయినాడు. మృతుని భార్య వడ్డే సాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది.