Site icon PRASHNA AYUDHAM

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన ర్యాలీ కి భారీ స్పందన.

IMG 20250626 WA0523 2

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన ర్యాలీ కి భారీ స్పందన.

 

– మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

 

– డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.

 

– డ్రగ్స్ మహమ్మరిని నిర్ములిదం…భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం.

 

– ప్రతి విద్యార్థి, యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారాలి.

 

– జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, ఐ.పి.యస్.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవ అవగహణ వారోత్సవాల, సంధర్భముగ గురువారం జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యములో జిల్లా కేంద్రంలో కొత్త బస్ స్టాండ్(చర్చ్) దగ్గరి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాభారతి ఆడిటోరియం లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి మాదకద్రవ్యాల దుర్వినియోగం – అక్రమ రవాణా వంటి అంశాలపై అవగహణ కల్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు స్నేహంలో బాగంగా గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సరదాగా అలవాటుపడి బానిసలుగా మారుతున్నారని వారి తల్లి తండ్రులు బయట చెప్పుకోలేక మనోవేదనలకు గురిచేస్తున్నారన్నారు. యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి విద్యార్థి, యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై సమాజములో అందరికీ అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో, పోలీసువారికి తమవంతుగా సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు. దీనిలో బాగముగా మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం 100 అడుగులు ముందుకు వేస్తుంది అని యువతలో స్పూర్తి నింపారు. మీ స్నేహితులు కానీ, తెలిసిన వారు కానీ మత్తు పదార్థాలు తీసుకుంటే కచ్చితముగా పోలీస్ వారికి సమాచారం అందివ్వాలని ఇవ్వకుంటే మీరు సమాజానికి ద్రోహం చేసిన వారీగా అవుతారని తెలియజేశారు. అనంతరం ఈ ర్యాలీలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని నేషనల్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908, 14446 కి లేదా డయల్ 100 లేదా వారి పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి డాక్టర్, సి హెచ్, వి ఆర్ ఆర్ వరప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జ్ టి. నాగరని, అదనపు కలెక్టర్ విక్రమ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంత రావ్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి , చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సి. ప్రమీల, విద్య శాఖ అధికారి రాజు, కామారెడ్డి ఆర్డీవో వీణ, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

“నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్, బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.” అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న చిన్న, పెద్ద, యువతి, యువకులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version