Site icon PRASHNA AYUDHAM

ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశంకు మెమో జారీ

IMG 20241219 WA06081

ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశంకు మెమో జారీ

మండల విద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నె ప్రభాకర్

ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 19, కామారెడ్డి :

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా, ఎల్లారెడ్డి మండల ఇన్చార్జి ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశంకు మెమో జారీ చేసినట్లు ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నే ప్రభాకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నా విధులకు సరిగా హాజరు కాకపోవడం, హాజరు పట్టికలో హాజరు సరిగ్గా లేకపోవడం, పాఠశాలకు సమయానికి హాజరుకాక పోవడంతో ఆర్డీవో మండల విద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగ పాఠశాలలో విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం గుడ్డు పెట్టక పోవడం, మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, సమయపాలన పాటించడం లేదని అన్నారు. అంతేకాకుండా ముగ్గురు ఉపాధ్యాయులు రికార్డులలో సిఎల్ అని నమోదు చేశారని, కానీ వాటికి సంబంధించిన సెలవు ఉత్తర్వులు లేకపోవడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంవల్ల మేమో జారీ చేసినట్లు తెలిపారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు సమర్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎవరైనా సరే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు.

Exit mobile version