టీ20 క్రికెట్లో నయా రికార్డ్.. 20 ఓవర్లు స్పిన్నర్లతోనే..
Jan 26, 2025,
టీ20 క్రికెట్లో నయా రికార్డ్ నమోదైంది. ఓ మ్యాచ్లో మొత్తం 20 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పార్ల్ రాయల్స్ జట్టు 20 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. దీంతో ఫ్రాంఛైజీ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. స్పిన్నర్లు రెహ్మాన్ 2, జార్న్
ఫోర్టుయిన్ 2, రూట్ 2, వెల్లలాగే ఒక వికెట్ తీశారు.