ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి/23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక ఉపాధ్యాయుడు తరచుగా పిల్లలను దండిస్తున్నాడు. అనే కారణంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి క్లాస్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారు,గత రెండు రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్నా ఒక విద్యార్థిని దండించగా చెవులో నుంచి రక్తం కారి తీవ్ర ఇబ్బంది పడ్డాడని,వారం రోజుల క్రితం మరొక బాబుని దండించగా చెంపలు వాపు వచ్చాయి,గత ఆరు నెలల నుంచి ఈ పాఠశాలలో ఇదే సంఘటనలు జరుగుతున్నాయని,ఎవరైతే పిల్లల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నరో ఆ టీచర్ ని విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు.